గత కొద్ది వారాలుగా ఉధృతంగా సాగుతున్న బంగ్లాదేశ్ అల్లర్లను అక్కడి ఆర్మీ అధికారులు కట్టడి చేయలేకపోయారు. అందుకే హ్యాండ్సప్ చెప్పారు. ప్రధానిగా షేక్ హసీనాతో రాజీనామా చేయించి.. ఆమెను దేశం దాటించారు. ప్రస్తుతం హసీనా ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ దిశగా వెళ్తోంది. అంతకుముందు ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. అధికార నివాసంలోకి చొరబడి తలుపులు, గాజు వస్తువులు, ఫైల్స్, ఫర్నీచర్, ప్రింటర్లు ధ్వంసం చేశారు. బెడ్ రూమ్ల్లోకి చొరబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. పక్కనే ఉన్న వాటర్ పూల్ లోకి దిగి బోట్లతో వీరంగం సృష్టించారు.మరోవైపు ఢాకాలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు.
Also Read: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. కూచ్బెహార్, పెట్రాపోల్ సరిహద్దుల్లో భద్రత పెంచారు. సరిహద్దుల్లో బలగాలను BSF అప్రమత్తం చేసింది.
#WATCH | Visuals from Integrated Check Post (ICP) at Fulbari on the India-Bangladesh border in West Bengal's Jalpaiguri from where Bangladesh nationals can be seen crossing over to their country
Sheikh Hasina has resigned as the Bangladesh PM and left her residence in Dhaka,… pic.twitter.com/cgDvNJiHFN
— ANI (@ANI) August 5, 2024