EPAPER
Kirrak Couples Episode 1

Britain: రిషి సునాక్‌కు షాక్.. జీతాల కోసం రోడ్డెక్కిన ఉద్యోగులు

Britain: రిషి సునాక్‌కు షాక్.. జీతాల కోసం రోడ్డెక్కిన ఉద్యోగులు

Britain: బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. ఈ క్రమంలో ప్రధాని రిషి సునాక్‌కు మరో చిక్కొచ్చి పడింది. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దాదాపు 5 లక్షల మంది లండన్ వీధుల్లో పదర్శన నిర్వహించారు. అందులో 3 లక్షల మంది టీచర్లు ఉండగా.. మిగతా వాళ్లు సివిల్ సర్వెంట్లు, ట్రైన్ డ్రైవర్లు ఉన్నారు.


కరోనా సమయంలో, ఉక్రెయిన్.. రష్యా యుద్ధం కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బందిపడుతున్నట్లు వారు వాపోయారు. వెంటనే గతంలో మాటిచ్చినట్లుగా జీతాలు పెంచాలని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు.

ఇక టీచర్లు సమ్మెలో పాల్గొనడంతో దాదాపు 23 వేల పాఠశాలలపై ప్రభావం పడింది. అలాగే రైలు డ్రైవర్లు కూడా సమ్మెకు దిగడంతో ట్రైన్లన్నీ నిలిచిపోయాయి. ఈ ప్రదర్శన బ్రిటన్‌లో గత దశాబ్దంలో జరిగిన అతి పెద్దదిగా వర్ణిస్తున్నారు.


అయితే రెండు రోజుల క్రితమే రిషి సునాక్ తన చేతిలో ఏం మ్యాజిక్ లేదని, ఇదెప్పటికీ జరిగేది కాదని స్పష్టం చేశాడు. అలాగే సమ్మెకు దిగవొద్దని.. అది గందరగోళానికి దారి తీస్తుందని ప్రధాని కార్యాలయం హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

Tags

Related News

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Israel vs Iran War: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Big Stories

×