Biden on Morbi Bridge Tragedy : గుజరాత్ మోర్బీ దుర్ఘటన ప్రపంచ దేశాలను కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీనిపై స్పందించారు. ‘మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యా.. మృతుల కుటుంబాలకు నేను జిల్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని అన్నారు.
భారత్, అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో భారత్కు మా సహకారం ఉంటుంది. బైడెన్తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఆమె తెలియజేశారు. బైడెన్ టీంలో పనిచేస్తున్న ఇతర సెక్రెటరీలు, ప్రముఖులు కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న కొందరిని కాపాడిన వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు.