Bangladesh quota violence: బంగ్లాదేశ్లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఈ అల్లర్లో ఇప్పటివరకు 32 మంది చనిపోయారు. 2,500మందికి పైగా గాయపడ్డారు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయంతో ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే ప్రజలు శాంతియుతంగా ఉండాలని, నిరసనలు ఆపేయాలని ప్రధాని చెప్పిన మరుసటి రోజే ప్రభుత్వ బ్రాడ్ క్యాస్టర్ నెట్వర్క్ భవనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. దీంతో అల్లర్లు మరింత ఉద్రిక్తతగా మారాయి.