EPAPER

Bangladesh SCBA President demand: షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌కు వర్తమానం

Bangladesh SCBA President demand: షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌కు వర్తమానం

Bangladesh SCBA President demand: యూకె నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మాజీ పీఎం షేక్ హసీనాపై దృష్టి సారించింది బంగ్లాదేశ్. హసీనా, ఆమె సోదరి అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని ఆదేశ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భారత్‌ను కోరారు.


బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లలో దాదాపు 400 మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా, ఆమె సోదరి రహానాను తమకు అప్పగించాలని భారత్‌ను కోరారు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖొకాన్. ఈ మేరకు ఢాకా ట్రిబ్యూన్ వెల్లడించింది.

రాజధాని ఢాకాలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాము భారత్‌తో స్నేహబంధాన్ని కొనసాగించాలని కోరుకున్నట్లు తెలిపారు. దయ చేసి షేక్ హసీనా, ఆమె సోదరిని అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు పంపించాల న్నారు.


ALSO READ: దారుణం.. ప్రముఖ హీరోను కొట్టి చంపేశారు!

బంగ్లాదేశ్‌లో హసీనా అనేక మరణాలకు కారణమైందని ఆయన ఆరోపించారు. మరోవైపు దేశంలో అత్య వసర పరిస్థితిని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ అవినీతికి పాల్పడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారం లోగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హసీనా ప్రభుత్వంలో నియమితులైన అటార్నీ జనరల్ ఏఎం అమీన్ ఉద్దీన్‌తోపాటు రాష్ట్రాల న్యాయ అధికారులు, అవినీతి నిరోధక కమిషన్ సభ్యులు, జాతీయ మానవ హక్కుల కమిషన్ అధిపతులు, అధికారులు రాజీనామా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అల్లర్ల నేపథ్యంలో అరెస్టయిన యువత, రాజకీయ నేతలను తక్షణమే విడుదల చేయాలన్నది ఆయన డిమాండ్.

Related News

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

Big Stories

×