Bangladesh Advisor On Hindu Security Phone Call To Prime Minister Modi: గత కొద్దిరోజులుగా బంగ్లాదేశ్లో మారణహోమం జరుగుతోంది.బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనార్టీలకు రక్షణ కరువైంది. అయితే ఇదే అంశంపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్ఖాన్ భారత ప్రధాని మోదితో ఫోన్లో మాట్లాడారు. బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పిస్తామని మోదీకి హామీ ఇచ్చారు ముఖ్య సలహాదారు యూనస్ఖాన్. ప్రొఫెసర్ యూనస్ఖాన్ తనకు ఫోన్ చేసి మాట్లాడినట్టు మోదీ సోషల్మీడియా వేదికగా వెల్లడించారు. ప్రజాస్వామ్య, శాంతియుతంగా ఉండాలని బంగ్లాదేశ్కి భారత్ మద్దతు ఇస్తుందని మోదీ ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
ఆగష్టు 15 సందర్భంగా చేసిన మోదీ ప్రసంగిస్తూ బంగ్లాదేశ్లోని హిందూ, మైనార్టీల పరిస్థితి గురించి మోదీ ప్రస్థావన తీసుకొచ్చారు. అనంతరం హింస నెలకొన్న బంగ్లాదేశ్లో జనజీవన పరిస్థితి త్వరలోనే సాధారణ పరిస్థితికి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పొరుగుదేశంలో ఉన్న హిందువులంతా దాడులకు గురవడంపై భారత్లోని 141 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని మోదీ తెలిపారు.
Also Read: బంగ్లాదేశ్ సంక్షోభం.. టార్గెట్ హిందూవులేనా?
ఈ నేపథ్యంలో యూనస్ఖాన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి ప్రస్తుతం అక్కడి పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా అన్ని కట్టుదిట్టమైన భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు యూనస్ఖాన్, భారత ప్రధానికి ఫోన్లో వివరించారు.
Received a telephone call from Professor Muhammad Yunus, @ChiefAdviserGoB. Exchanged views on the prevailing situation. Reiterated India's support for a democratic, stable, peaceful and progressive Bangladesh. He assured protection, safety and security of Hindus and all…
— Narendra Modi (@narendramodi) August 16, 2024