Fire Accident in Bangladesh : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఏడంతస్తుల రెస్టారెంట్ లో మంటలు చెలరేగడంతో.. సుమారు 44 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. 75 మందిని రక్షించారు. రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఢాకా బెయిలీలోని రోడ్డులో ఉన్న బిర్యానీ రెస్టారెంట్ లో గురువారం రాత్ర మంటలు చెలరేగాయని తమకు సమాచారం అందిందని అగ్నిమాపక అధికారి మహమ్మద్ షిహబ్ వెల్లడించారు. మంటలు క్రమంగా పై అంతస్తులకు వ్యాపించాయని, రెండుగంటల్లోనే వాటిని అదుపులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. కాగా.. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు, క్లాత్ షోరూమ్స్, మొబైల్ ఫోన్ల విక్రయ కేంద్రాలు అధికంగా ఉన్నాయి.
Read More : ఉత్తర ప్రదేశ్లో దారుణం.. కుమార్తెను ప్రేమించిన యువకుడిని హతమార్చిన తల్లిదండ్రులు
ప్రమాద ఘటనపై రెస్టారెంట్ మేనేజర్ సోహెల్ ఇలా చెప్పారు. తాము ఆరవ అంతస్తులో ఉండగా.. మెట్ల మార్గం గుండా పొగ వస్తుండటాన్ని గమనించామన్నారు. అప్పుడు అందరూ కిందినుంచి పైకి పరిగెత్తుతూ వచ్చారని, ప్రమాదాన్ని గ్రహించి.. తామంతా నీటి పైపుల ద్వారా కిందికి దిగినట్లు చెప్పారు. కొందరు ప్రాణాలను కాపాడుకునేందుకు పై నుంచి దూకడంతో గాయాలయ్యాయని, మరికొందరు సహాయం చేయాలంటూ కేకలు వెశారన్నారు. కాగా.. 2019 ఫిబ్రవరిలో కూడా డాకాలో అపార్ట్ మెంట్ బ్లాకుల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 70 మంది దుర్మరణం చెందారు. 2021 జులైలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది పిల్లలు సహా 52 మంది మృతి చెందారు.