Indian Student Jaahnavi Kandula’s Death(Today’s news in telugu): అమెరికాలో ఇండియా స్టూడెంట్ కందుల జాహ్నవి మృతిని చులకన చేశాడు ఓ పోలీసు అధికారి. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. ఆయన వ్యవహారంపై ఇంటాబయటా తీవ్ర దుమారం రేపింది. చివరకు ఉన్నతాధికారులు ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయం అమెరికా వ్యాప్తంగా సంచలనం రేపింది.
అసలు స్టోరీలోకి వెళ్తే.. గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి సియాటెల్లో పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి డేనియల్ అడెరెర్.. యువతి మృతిపై చులకనగా మాట్లాడిన పగలబడిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది.
వీడియో వ్యవహారం చివరకు పైస్థాయి అధికారుల వరకు వెళ్లింది. ఈలోగా సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. పరిస్థితి గమనించిన పోలీసు అధికారిని సస్పెండ్ చేసింది. తాజాగా డేనియల్ను ఉద్యోగం నుంచి తొలగించింది.
ALSO READ: ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో భారతీయులు క్షేమం
ఈ పరిస్థితుల్లో డేనియల్ను విధుల్లో కొనసాగించడం డిపార్ట్మెంటుకు చెడ్డపేరు వచ్చిందని భావించి, ఉద్యోగం నుంచి తొలగించారు అధికారులు. జాహ్నవి మృతిపై డేనియల్ చేసిన వ్యాఖ్యలు ఆమె కుటుంబాన్ని తీవ్రంగా గాయపరిచాయని సియాటెల్ పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఆయన మాటలు సియాటెల్ పోలీసులకు మాయని మచ్చగా వర్ణించారు.