Actress Nushrratt Bharuccha : ఇజ్రాయెల్ దాడుల్లో చిక్కుకున్న బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా సేఫ్గా ఉన్నారు. ఆమె సురక్షితంగా ముంబై వచ్చేశారు. హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం.. ఆమె ఇజ్రాయెల్ వెళ్లారు. నిన్నటితో అక్కడ వేడుకలు ముగియడంతో సభ్యులంతా స్వదేశానికి బయల్దేరారు. ఇంతలో నిన్న(శనివారం) మధ్యాహ్నం 12.30 తర్వాత నుంచి ఆమెతో సంబంధాలు తెగిపోయాయని సభ్యులు తెలిపారు. ఈమె తెలుగులో శివాజీ సరసన 2010లో విడుదలైన తాజ్మహల్ సినిమాలో కూడా నటించారు. బాలీవుడ్ లో 25 సినిమాల్లో నటించారు.
వేలమంది భారతీయ విద్యార్థులు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి నుస్రత్ భరోచా కనిపించకుండా పోయిందన్న వార్త సంచలనంగా మారింది. నుష్రత్ మిస్ అయ్యారన్న వార్తలతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆమెకు ఏం జరగకూడదని ప్రార్థనలు చేశారు. మొత్తానికి నుష్రత్ ప్రాణాలతో కనిపించడంతో అభిమానులంతా హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకున్నారు. నుష్రత్ భరూచా తాను నటించిన సినిమా అకెల్లి ప్రదర్శన కోసం హైఫా నగరంలో ఉన్నారు. ఈ సినిమాలో ప్రముఖ వెబ్ సిరీస్ ఫౌడాలో నటించిన ఇజ్రాయెల్ నటులు సాహిహలేవి, అమీర్ బౌట్రస్ కూడా ఉన్నారు.