EPAPER

Nepal Bus Accident : నదిలో పడిన బస్సు.. ఏడుగురు మృతి

Nepal Bus Accident : నదిలో పడిన బస్సు.. ఏడుగురు మృతి
nepal bus accident
nepal bus accident

7 Killed in Nepal Bus Accident : నేపాల్ బాగ్మతి ప్రావిన్స్ లో జరిగిన బస్సు ప్రమాదంలో ఒక మహిళ సహా ఏడుగురు మరణించగా.. మరో 30 మంది గాయపడ్డారు. ఘట్ బేసి నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండుకు వెళ్తున్న ప్యాసింజర్ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. బస్సు త్రిశూలి నదిలో పడిపోయింది. ధాడింగ్ జిల్లా పోలీస్ కార్యాలయానికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గౌతమ్ కెసి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో మహిళ సహా కనీసం ఏడుగురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన పోలీసులు, నేపాల్ సైన్యం, సాయుధ పోలీస్ దళం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


గాయపడిన వారిని రెస్క్యూ చేసి.. స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేశారు. అనంతరం ఖాట్మండుకు తరలించినట్లు ఎస్పీ గౌతమ్ తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. బస్సులో నదిలో పడి ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×