Myanmar | భారత పొరుగుదేశం మయన్మార్లో సాయుధ విద్రోహ దళాల బలం రోజురోజుకీ పెరిగిపోతోంది. మయన్మార్లో జుంటా సైనిక పాలన నడుస్తోంది. అక్కడ అధికారిక జుంటా సైన్యానికి, విద్రోహ అరాకన్ ఆర్మీకి మధ్య సాయుధ పోరాటం నడుస్తోంది. అయితే ఈ రెబెల్ ఆర్మీ దెబ్బకు మయన్నార్ సైనికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు భారత సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్నారు.
Myanmar | భారత పొరుగుదేశం మయన్మార్లో సాయుధ విద్రోహ దళాల బలం రోజురోజుకీ పెరిగిపోతోంది. మయన్మార్లో జుంటా సైనిక పాలన నడుస్తోంది. అక్కడ అధికారిక జుంటా సైన్యానికి, విద్రోహ అరాకన్ ఆర్మీకి మధ్య సాయుధ పోరాటం నడుస్తోంది. అయితే ఈ రెబెల్ ఆర్మీ దెబ్బకు మయన్నార్ సైనికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు భారత సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్నారు. ముఖ్యంగా భారత భూభాగంలో ఉన్న మిజోరం రాష్ట్రంలో దాదాపు 600 మంది మయన్నార్ సైనికులు శరణార్థులుగా మారారు.
ఈ పోరాటంలో అరాకన్ రెబెల్ ఆర్మీ గత కొంత కాలంగా జుంటా సైనికులు స్థావారాలను ఆక్రమించుకుంటోంది. ఈ దెబ్బతో మయన్నార్ సైనికులు అక్కడి నుంచి పారిపోయి మిజోరం రాష్ట్రంలోని లాంగట్లాయి జిల్లాలో తలుదాచుకున్నారు. శరణార్థులుగా వస్తున్న మయన్మార్ సైనికుల సంఖ్య ఎక్కువ కావడంతో మిజోరం ముఖ్యమంత్రి లాల్ దుహోమా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సైనికులను త్వరగా వారి దేశానికి తిరిగి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో కూడా ఈ అంశంపై చర్చించారు. దీనిపై అమిత్ షా మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సరిహద్దుల పొడువునా ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మిజోరం సిఎం ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండేందుకు ఈ సైనికులని తిరిగి పంపించేయాలని చెప్పారు. సైనికులే కాదు చాలామంది మయన్నార్ పౌరులు భారత సరిహద్దులు దాటి దేశ భూభాగంలోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి చాలా కాలంగా ఉందని.. ముందుకూడా మయన్మార్ సైనికులు ప్రాణాలు కాపాడుకునేందుకు మిజోరం వచ్చేవారని వారందరినీ విమానంలో తిరిగి పంపించేవారమని అన్నారు.
ఇటీవల ఈ అరాకన్ ఆర్మీ భారత సరిహద్దులకు సమీపంలో ఉన్న ఓ కీలక పట్టణాన్ని ఆక్రమించుకుంది. ఈ రెబెల్ ఆర్మీ బలంగా మారడానికి ముఖ్య కారణం చైనా. ఈ అరాకన్ ఆర్మీకి ఆయుధాలు చైనా అండదండలతోనే సమకూరుతున్నాయి. 2021లో మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడి సైన్యం అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి అక్కడ సాయుధ పోరాటం జరుగుతోంది.
Myanmar, Myanmar soldiers, Arakan Army, Indian territory, Mizoram,