Land Slides : కొండచరియలు విరిగిపడటంత 47 మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం చైనాలోని పర్వత ప్రాంతమైన యునాన్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో మరికొంరు గాయాలపాలైనట్లు సమాచారం. ఘటనా ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. 200 మందిని రక్షించారు.
స్థానిక మీడియా తెలిపిన కథనాల ప్రకారం.. చైనాలోని నైరుతి ప్రావిన్స్ లోని యునాన్ లో ఈ ప్రమాదం జరిగింది. యున్నాన్ లోని లియాంగ్ సుయ్ గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో.. 18 ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం జెన్ జియాంగ్ కౌంటీలోని టాంగ్ ఫాంగ్ నగరానికి చెందినదదిగా గుర్తించారు. కాగా.. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.