America : ఓ నర్స్ చేసిన పని వల్ల పది మంది అమాయక రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషాద ఘటన అమెరికాలో జరిగింది. యూఎస్ ఒరెగాన్లోని ఓ ఆసుపత్రిలో నర్సు రోగులకు ఇచ్చిన మందులను దొంగిలించి వాటికి బదులుగా డ్రిప్ వాటర్ ను ఇంజెక్ట్ చేసింది. దీంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆసుపత్రిలో ఇచ్చే మందులు చోరీకి గురి కావడంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. డిసెంబర్ ప్రారంభంలో ఓ మాజీ ఉద్యోగి మందులను దొంగిలించారని పోలీసులు అధికారులను అలర్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
హాస్పటల్ లో పేషెంట్స్ కు ఇచ్చే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ నర్సు దొంగతనం చేసి దాన్ని కప్పి పుచ్చేందుకు రోగులకు డ్రిప్ వాటర్ ని ఇంజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఈ ఆసుపత్రిలో మృతి చెందిన వ్యక్తుల మరణాలు ఇన్ఫెక్షన్ కారణంగానే జరిగాయని ఆస్పత్రి అధికారులు తమతో చెప్పారని మృతుల కుటుంబ సభ్యులు అంటున్నారు.ఈ మరణాలు మెడిసిన్ చోరీ వల్ల జరిగిందా లేక ట్యాంపరింగ్ వల్ల జరిగిందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.