YS Jagan – Sirivennela:టాలీవుడ్ దివంగత ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబాన్ని ఆదుకున్నందుకు సిరివెన్నల సతీమణి సహా ఇతర కుటుంబ సభ్యులందరూ ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సిరివెన్నెల అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆయన హాస్పిటల్ ఖర్చులన్నింటినీ సీఎం జగన్ ఆదేశాల సారం ఏపీ ప్రభుత్వం భరించింది. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సిరివెన్నెల కుటుంబ సభ్యులు జగన్ను కలిశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డితో సిరివెన్నెలకు ఉన్న అనుబంధాన్ని వారు జగన్తో పంచుకున్నారు.
సిరివెన్నెల కుటుంబానికి సీఎం జగన్ విశాఖ పట్నంలో ఇంటి స్థలాన్ని మంజూరు చేశారు. ఈ సందర్భంగా సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. సిరివెన్నెల సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీ లలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్.శాస్త్రి వై.ఎస్.జగన్ను కలిసిన వారిలో ఉన్నారు.
Sharwanand : ఆ యువతితో హీరో శర్వానంద్ ఎంగేజ్ మెంట్.. ఫోటోలు వైరల్..
Waltair Veerayya: తెలంగాణలో ఫిక్స్ చేసిన ‘వాల్తేరు వీరయ్య’