Yatra 2 Song update(Telugu cinema news) :
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ సినిమా 2019 లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్ గా యాత్ర 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్ మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతోంది.
ఈ సినిమా వైఎస్ జగన్ పాత్రలో హీరో జీవా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా యాత్ర 2 సినిమా నుంచి “చూడు నాన్న .. నీడ లేని నేనా వీళ్ళ ధీమా” అంటూ సాగే ఓ ఎమోషనల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇందులో వైఎస్సార్ మరణం తర్వాత జగన్ ప్రజలను కలవడం , ప్రజలు జగన్ కి ఆప్యాయంగా స్వాగతం పలకడం, వారి బాధలు చప్పుకోవడం, వారికి వైఎస్సార్ చేసిన మంచి చెప్పడం వంటివి చూపించారు.
చివర్లో దేవుడు అనేది నమ్మకం, వైఎస్సార్ అనేది నిజం అంటూ ఎమోషనల్ డైలాగ్ చెప్పించారు. ప్రస్తుతం ఈపాట వైరల్ గా మారింది. వైఎస్సార్ అభిమానులు పాటని ఎంతగానో అభినందిస్తున్నారు. ఇక జగన్ పాత్రలో జీవా నటించాడు అనే కంటే జీవించాడు అనే చెప్పాలి . ఎమోషనల్ సీన్స్ ను అద్భుతంగా చేసాడు జీవా ఒక పాటలోనే ఈ రేంజ్ లో ఉందంటే .. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఎన్ని వుంటాయో అనుకుంటున్నారు ఆడియన్స్ . ఇక యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది.