yatra-2: ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికల సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు సంబంధించిన చిత్రాలు కూడా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో దర్శకుడు మహి వి రాఘవ్ డైరెక్షన్లో వైఎస్సార్ బయోపిక్గా తెరకెక్కిన యాత్ర సినిమాకి సీక్వెల్గా యాత్ర-2 ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో వైఎస్సార్గా మమ్ముట్టి నటించారు. ఇక సీక్వెల్ మూవీలో ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డిగా తమిళ నటుడు జీవా కనిపించబోతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఉంది. ఇకపోతే డైరెక్టర్ మహివి రాఘవ లేటెస్ట్గా ఈ సినిమా రిలీజ్ డేట్తో పాటు టీజర్ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసారు.
ఈ మూవీ టీజర్ని జనవరి 5న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. మూవీని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక అనౌన్స్మెంట్ పోస్టర్లో వైఎస్సార్గా మమ్ముట్టి, జగన్గా జీవా లుక్ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఇక యాత్ర 2నే కాకుండా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం కూడా ఎన్నికల నేపథ్యంలో జగన్ బయోపిక్ గా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ వ్యూహం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.