EPAPER

Sriramana : ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూత.. టాలీవుడ్ లో విషాదం..

Sriramana : ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూత.. టాలీవుడ్ లో విషాదం..

Sriramana : ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూశారు. 70 ఏళ్ల ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం వేకువజామున 5గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు బాపు, రమణతో కలిసి శ్రీరమణ పనిచేశారు.


మిథునం సినిమా శ్రీరమణకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. తనికెళ్ల భరణి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఆయన కథ అందించారు. 2012లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది.

శ్రీరమణ గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబర్ 21న జన్మించారు. ఆయన అసలు పేరు కామరాజ రామారావు. రచయితగా శ్రీరమణ తనదైన ముద్ర వేశారు. పేరడి రచనలు ఆయనకు ఎంతో పేరుతెచ్చాయి. ఆయన పలు తెలుగు దిన పత్రికల్లో పని చేశారు. నవ్య వార పత్రికకు ఎడిటర్‌గా శ్రీరమణ కొంతకాలం పనిచేశారు. కాలమిస్టుగా, కథకుడిగా, సాహిత్య, కళా రంగాలకు విశిష్ట సేవలందించారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.


Related News

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Sekhar Bhashaa : జానీ మాస్టర్ కేసు పై సంచలన నిజాలను బయట పెట్టిన శేఖర్ భాషా..?

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Big Stories

×