Big Stories

Vishnu Manchu Prakash Raj : ‘మా’ పని తీరుపై ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు.. చెబితే చేసిట్లు కాదని కౌంటర్

Vishnu Manchu Prakash Raj : ‘మా’ అధ్యక్షుడుగా విష్ణు మంచు రీసెంట్ ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు తాను ఎన్నికల సమయంలో చేస్తానని చెప్పిన దాంట్లో 95 శాతం పనులను నేరవేర్చానని తెలియజేశారు. ‘మా’ బిల్డింగును మాత్రమే నిర్మించాల్సి ఉందని, ఫిల్మ్ ఛాంబర్ స్థలంలో కట్టబోయే భవనంలో ‘మా’ కోసం స్థలాన్ని కొనిస్తానని విష్ణు మంచు తెలియజేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రకాష్ రాజ్‌ని ప్రశ్నించినప్పుడు.. ‘‘ఇప్పటి వరకు ఏడాది సమయం మాత్రమే పూర్తయ్యింది. గెలిచారు.. ఏం పని చేశారనేది అందరికీ తెలుసు. అలాగే సభ్యులకు కూడా తెలుసు. ప్రకటించటం వల్ల పనులు చేసినట్లు కాదు. ఓ మనిషి ఓ మాట చెబుతాడు. అది నిజమా..కాదా? అని నమ్మడమనేది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రకటించటం వాళ్ల బాధ్యత ప్రకటించారు’’ అని అన్నారు.

- Advertisement -

మరో ఏడాది తర్వాత ‘మా’ ఎన్నికలు రాబోతున్నాయి. మళ్లీ పోటీ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘చూద్దాం.. ఇప్పుడున్నవారు ఏ పని చేశారో చూద్దాం’’ అన్నారు. అయితే తాను ఇకపై మా సహా ఎలాటి ఎన్నికల్లోనూ పోటీ చేయాలనుకోవటం లేదని విష్ణు మంచు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న విష్ణు మంచు ప్యానెల్ పదవీ కాలం ముగియటానికి ఏడాది సమయం ఉంది. తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News