Venuswami: ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి.. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలను చెప్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పి అందరినీ షాక్కు గురి చేశారు. ఆయన మాటలతో పవన్ అభిమానులు వేణుస్వామిపై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆయన.. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారు?.. ఫ్యాన్స్ ఎందుకు అంతలా ఆయనపై ఫైర్ అవుతున్నారో అన్న విషయానికొస్తే..
తాజాగా వేణు స్వామి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ విడాకులు తీసుకుంటారు అంటూ అందరికీ షాక్ ఇచ్చారు. 2024లో పవన్ కళ్యాణ్ మరొకసారి కాంట్రవర్సీల పాలవుతారని అన్నారు. అతనికి సినిమా పరంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కాంట్రవర్సీలకు గురవుతారని అన్నారు. అయితే ఆయనకు గైడ్ చేసేవారు లేక రాజకీయాలు చేస్తూ అనవసరంగా తన కెరియర్ను, పేరుని నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
కాగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తాను కూడా చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. కానీ ఈ విషయం అభిమానులకు అర్థం కాక తన మీద ట్రోల్ చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు 2024లో పవన్ కళ్యాణ్ మూడవసారి విడాకులు తీసుకొనే అవకాశం ఉందంటూ బాంబు పేల్చారు. ఇక ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మేలుకోవాలని.. తాను ఏం చేస్తే సీఎం అవుతానో అర్థం చేసుకోవాలని అన్నారు. దీంతో వేణుస్వామి చేసిన ఈ హాట్ కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి.