Venkat Boyanapalli: సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘సైంధవ్’ చిత్రం రిలీజ్కు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ చిత్ర నిర్మాత వెంకట్ బోయనపల్లి తాజాగా విలేకర్లతో ముచ్చటించారు. ఈ మేరకు ఆయనకు టాలీవులో ఇద్దరు హీరోలు ఇష్టమని చెప్పారు. అంతేకాకుండా ఆయన తొలి సినిమాగా వాళ్లిద్దరినీ కలిపి ఓ మల్టీస్టారర్ చేయాలనుకున్నట్లు తెలిపారు. అలా కుదరకపోవడంతో ఇప్పుడు వెంకటేశ్ 75వ సినిమాని నిర్మించే అవకాశం తనకు రావడం ఎంతో ఆనందంగా ఉందని.. అది అతని అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. అయితే ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు.. నేచురల్ స్టార్ నాని, విక్టరీ వెంకటేశ్లు.
నాని తనను నిర్మాతని చేశారని అన్నారు. ఆయనతో సినిమాలు చేశాక.. మరో ఇష్టమైన హీరో వెంకటేశ్తో సినిమా చేశానని తెలిపారు. అయితే ఆ ఇద్దరితో కలిపి ఓ మల్టీస్టారర్ సినిమా తీయాలనే తన కల నెరవేరలేదు అని అన్నారు. కానీ, అది ఎవరు తీసినా తనకు ఇష్టమేనంటూ చెప్పారు. వాళ్లిద్దరి కోసం తానుకూడా కథల్ని వెదుకుతున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ చేస్తే ఇంకా సంతోషిస్తానని అన్నారు. ఇష్టమైన హీరోలు.. దర్శకులతో కలిసి సినిమాలు చేయడంలో ఉన్న ఆ ఆనందమే వేరు అని అన్నారు. ఇక నానితో ‘కృష్ణార్జున యుద్ధం’, ‘శ్యామ్ సింగరాయ్’ చేశాక.. ఇప్పుడు వెంకటేశ్తో ‘సైంధవ్’ నిర్మించానని తెలిపారు.