Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సినిమాను నిర్మించారు. సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్కి సిద్ధమవుతుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే ఊపులో నందమూరి బాలకృష్ణ జనవరి 6న ఒంగోలులో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేశారు. అయితే ఏపీ గవర్నమెంట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను క్యాన్సిల్ చేసింది. అందుకు డైరెక్ట్ కారణాలు తెలియటం లేదు కానీ.. రీసెంట్గా భారీ సభలను జన సమూహాలు మధ్య నిర్వహించకూడదనే కారణంతో క్యాన్సిల్ చేసి ఉంటారనే అందరూ భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఎక్కడ నిర్వహిస్తారో చూడాలి. మరి నిర్మాతలు.. నిర్వాహకులు డేట్లో మార్పు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం కావటంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగానే క్రియేట్ అయ్యాయి. శ్రుతీ హాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు.