Veera Simha Reddy: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. థియేటర్లు దద్దరిల్లిపోయాయి. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ ప్రత్యేక పాత్రలో నటించారు.
థియేటర్లలో దుమ్మురేపిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ+హాట్ స్టార్లో ఈనెల 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. దీంతో థియేటర్లో చూడలేని వారు ఓటీటీలో చేసేందుకు రెడీ అయిపోతున్నారు.