Veera Simha Reddy Collections:నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వీర సింహా రెడ్డి’ . గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మాతలు. సంక్రాంతి సందర్బంగా ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ రిలీజైంది. తొలి రోజున రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్ సీస్లలో కలిపి సినిమాకు రికార్డ్ వసూళ్లు వచ్చాయి. నైజాంలో రూ.7 కోట్లు, సీడెడ్లో ఏడు కోట్లు కలెక్షన్స్ రాగా.. ఆంధ్రలో దాదాపు రూ.33 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.1.75 కోట్లు రాగా.. ఓవర్ సీస్లో రూ.4కోట్ల మేరకు వసూళ్లు వచ్చాయి. మొత్తంగా కలిపి చూస్తే రూ. 54 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. షేర్ వసూళ్ల ప్రకారం చూస్తే ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి రూ.32 కోట్లను క్రాస్ చేసింది.
నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ‘వీర సింహా రెడ్డి’ నిలిచిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మాస్ కంటెంట్, హీరో ఇమేజ్, క్రేజ్, డైరెక్షన్, మేకింగ్ వేల్యూస్తో పాటు సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావటంతో ‘వీర సింహా రెడ్డి’ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం క్రియేట్ చేస్తున్నారు. ఇదే ఊపును కొనసాగిస్తూ కలెక్షన్స్ ఊచకోత ఖాయమని మేకర్స్ అంటున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రుతీ హాసన్, హనీ రోజ్ హీరోయిన్స్గా నటించారు.