Varun Sandesh: హీరో వరుణ్ సందేశ్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. దానికి కారణం వరుణ్ చేసిన ఆర్థిక సాయం. గత కొన్నిరోజులుగా వయనాడ్ లో జరుగుతున్న మృత్యుఘోష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొండ చరియలు విరిగిపడి ఎంతోమంది మృత్యువాత పడ్డారు. మరెంతోమంది గాయపడ్డారు. ప్రకృతి కోపానికి ఎంతోమని అమాయకులు బలయ్యారు.
ఇక వయనాడ్ బాధితుల సహాయార్థం ఎంతోమంది ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చి మంచి మనసును చాటుకుంటున్నారు. తమిళ్ స్టార్స్ తో పాటు టాలీవుడ్ స్టార్స్ కూడా విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ కలిపి రూ. 1.5 కోట్లు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళాలు అందించారు.
తాజాగా హీరో వరుణ్ సందేశ్ సైతం తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 5 కోట్లు విరాళంగా అందించాడు. ఇక దీంతో వరుణ్ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఒక్కో సినిమాకు కొన్ని కోట్లు తీసుకొనే హీరోల కంటే.. ప్లాపులు అందుకున్నా.. తాను సొంతంగా దాచుకున్న డబ్బును మంచి మనసుతో విరాళంగా అందించిన వరుణ్ సందేశ్ గొప్పతనం గురించి అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
2 కోట్లు విరాళంగా అందించిన ప్రభాస్.. రాజు అయితే.. 5 కోట్లు ఇచ్చిన వరుణ్ సందేశ్ నిజంగా రారాజే అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక వరుణ్ కెరీర్ గురించి చెప్పాలంటే.. సినిమాలు అయితే చేస్తున్నాడ కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈ మధ్యనే విరాజి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నట్లు టాక్. మరి వరుణ్ కమ్ బ్యాక్ ఎప్పుడు అవుతాడో చూడాలి.