Vani Jairam: ప్రముఖ గాయని వాణీజయరాం తన ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, హిందీ.. ఇలా 14 భాషల్లో దాదాపు 20వేలకు పైగా పాటలను పాడారు. మొట్టమొదటిసారి 1970లో బాలీవుడ్ మూవీ ‘గుడ్డీ’లో ‘బోలే రే’ అనే పాటను ఆలపించారు. అప్పట్లో ఆ పాట సూపర్ హిట్ అయి పలు అవార్డులు కూడా వచ్చాయి.
తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ సినిమా పాటలు ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చాయి. తెలుగులో ‘శంకరాభరణం’ సినిమాతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఈ పాటలతో జాతీయ అవార్డుని కూడా అందుకున్నారు. దీంతో తెలుగులో మరోచరిత్ర, వయసు పిలిచింది, మంగమ్మ గారి మనవడు, స్వాతికిరణం, శృతి లయలు, స్వర్ణకమలం, సీతాకోక చిలుక..లాంటిఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడి ప్రేక్షకులని ఆకట్టుకున్నారు.
14 భాషల్లో పదివేలకిపైగా పాటలు పాడిన వాణీ జయరాం నంది అవార్డులు, వివిధ స్టేట్ అవార్డులు, నేషనల్, ఫిలింఫేర్, సైమా, వివిధ దేశాల అవార్డుల్ని అందుకున్నారు. తాజాగా ఆమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. ఇంతలోనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటంతో.. కుటుంబీకులు, ఆమె అభిమానులు… శోకసంద్రంలో మునిగిపోయారు.