Big Stories

Vaarasudu : ‘వారసుడు’ విడుదలపై మనసు మార్చుకున్న దిల్ రాజు..!

Vaarasudu : టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు సంక్రాంతి బరిలోకి త‌న సినిమా వార‌సుడుని దించుతున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు బ‌లంగా వినిపించాయి. వార‌సుడు (త‌మిళంలో వారిసు) సినిమాకు ఓ రోజు ముందు అంటే జ‌న‌వ‌రి 11న అజిత్ తెగింపు సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్నారు. అయితే విజ‌య్ ఫ్యాన్స్ వార‌సుడు సినిమాను ఓ రోజు ఆల‌స్యంగా విడుద‌ల చేయ‌టానికి ఒప్పుకోలేదు. దీంతో వార‌సుడు నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్‌ త‌మ నిర్ణ‌యం మార్చుకున్నార‌ట‌. చివ‌ర‌కు వార‌సుడు సినిమాను జ‌న‌వ‌రి 11నే విడుద‌ల చేయటానికి నిర్ణ‌యించుకున్నారు. దానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.

- Advertisement -

ద‌ళ‌ప‌తి విజ‌య్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం వార‌సుడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్ సినిమా కంటెంట్ ఏంటో చెప్ప‌క‌నే చెప్పేసింది. విజ‌య్ ఫ్యాన్స్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వార‌సుడు సినిమా రిలీజ్ అవుతుంది. శ‌ర‌త్ కుమార్‌, రాధిక‌, శ్రీకాంత్‌, శ్యామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News