Upasana: రామ్చరణ్-ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కుండే క్రేజే వేరు. త్వరలో వీళ్లిద్దరు ముగ్గురు కాబోతున్నారు. పండంటి బిడ్డకు ఉపాసన జన్మనివ్వబోతుంది. అయితే రామ్చరణ్, ఉపాసనల పెళ్లై పదేళ్లు దాటింది. ఇంత ఆలస్యంగా గర్భం దాల్చడం వెనుకగల కారణాలను తాజాగా ఉపాసన చెప్పుకొచ్చింది.
‘‘పెళ్లైన పదేళ్ల తర్వాత మేం బిడ్డలను కనాలని అనుకున్నాం. ఇదే సరైన సమయం. మేము ఆర్థికంగా స్థిరపడ్డాం. మా పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చే స్థాయికి చేరాం. సమాజం కోరుకున్నప్పుడు కాకుండా.. నేను కావాలనుకున్నప్పుడు గర్భం దాల్చడం ఎంతో ఉత్సాహంగా, గర్వంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది ఉపాస.
ప్రస్తుతం ఉపాసన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇకపోతే త్వరలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. డెలివరీ కూడా ఇండియాలోనే జరుగుతుందని ఇప్పటికే చరణ్, ఉపాసన క్లారిటీ ఇచ్చారు.