VD12 : విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. గతేడాది శ్రీలీల హీరోయిన్గా ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. శ్రీలీల స్థానంలో బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రిని కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చిత్రబృందం ఇప్పటికే ఆమెను సంప్రదించిందని సమాచారం. ఈ మూవీలో నటించేందుకు ఆమె కూడా పచ్చజెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు “సప్త సాగరాలు దాటి” మూవీ ఫేమ్ రుక్మిణీ వసంత్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ కథనాలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు.
ఇది విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 12వ సినిమా. ఈ చిత్రం VD12గా ప్రచారంలో ఉంది. స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. దీన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ నిర్మిస్తున్నాయి. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. మార్చి నుంచి షూట్ రెగ్యులర్ గా మొదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్కు చెందిన త్రిప్తి డిమ్రి.. ‘యానిమల్’తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఆ చిత్రంలో రష్మిక కన్నా త్రిప్తి ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ యాక్షన్ డ్రామా చిత్రంతో త్రిప్తి యువ హృదయాలను కొల్లగొట్టింది.
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో వరసగా విజయ్ దేవరకొండ సూపర్ హిట్లు అందుకున్నాడు. ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. దీంతో ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ ప్రాజెక్టులపైనే పెట్టుకున్నాడు.