Tollywood.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు అడుగుపెట్టిన కొత్తలోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుని , ఆ తర్వాత అవకాశాలు అందుకోవడంలో విఫలమై, డబ్బు మీద వ్యామోహంతో చివరికి కెరీర్నే నాశనం చేసుకున్న చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి దూరమైపోయారు. అలాంటి వారిలో కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్వేత బసు ప్రసాద్ (Swetha Basu Prasad) కూడా ఒకరు. ముఖ్యంగా ఇందులో ఆమె చేసిన క్యారెక్టర్ ను మర్చిపోవడం అనేది అంత సులభం కాదు. ఎపుడు.. ఎకడ.. అనే డైలాగ్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్..
శ్రీకాంత్ అడ్డాల (Srikantha addala)దర్శకత్వంలో వరుణ్ సందేష్ (Varun sandesh) హీరోగా శ్వేతాబసు ప్రసాద్ హీరోయిన్ గా విడుదలైన చిత్రం కొత్త బంగారులోకం. ఈ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస చిత్రాలు తలుపు తడుతాయని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని చిత్రాలకే పరిమితమైంది. అంతేకాదు సినిమా అవకాశాల కోసం, డబ్బు కోసం, చేయకూడని పనులు కూడా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచి , చివరికి కెరియర్ నే నాశనం చేసుకుంది.
వ్యభిచార రొంపులోకి దిగిన హీరోయిన్..
సినిమాలలో అవకాశాలు తగ్గడంతో లగ్జరీకి అలవాటు పడిన ఈమె డబ్బు లేక వ్యభిచార రొంపులోకి దిగిందని.. అక్కడ ఉన్నట్టుండి ఒక హోటల్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిందని సమాచారం. ఈ ఘటన నుంచి ఆమె బయటకు రావడానికి చాలా సమయం పట్టిందని చెప్పాలి. ఆ తర్వాత 2018లో రోహిత్ మిట్టల్ అనే బిజినెస్ మాన్ ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈమె ఏడాది గడవకముందే వివాదాలు ఏర్పడి అతడి నుంచి విడిపోయింది.. అనంతరం బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ , ఇండియా లాక్ డౌన్, క్రిమినల్ జస్టిస్ లాంటి పలు వెబ్ సిరీస్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
గుర్తుపట్టలేనంతగా మారిన హీరోయిన్..
ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శ్వేతా బసు ప్రసాద్ వరుస హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా కొత్త బంగారులోకం సినిమా సమయంలో బొద్దుగా కనిపించిన ఈమె, ఇప్పుడు బక్క చిక్కి మరింత గ్లామర్ వలకబోస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఒక రకంగా చెప్పాలి అంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయిన శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు వరుస ఫోటోలు షేర్ చేస్తూ గ్లామర్ లుక్కుతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే డబ్బు మీద వ్యామోహంతో సినిమాలలో అవకాశాలు రాక వ్యభిచార రొంపులోకి దిగి లగ్జరీ లైఫ్ ని పొందాలనుకుంది. కట్ చేస్తే చివరికి కెరీర్ నే నాశనం చేసుకొని ఇప్పుడు ఆ కెరియర్ ను మళ్ళీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఏది ఏమైనా శ్వేతా బసు ప్రసాద్ కు చెందిన ఈ వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.