Tollywood heroin.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న అతి కొద్ది మంది యంగ్ బ్యూటీస్ లో ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi)కూడా ఒకరు. తన అంద చందాలతో క్యూట్ స్మైల్ తో గ్లామరస్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె, సడన్ గా హాస్పిటల్లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. తన చేతికి సెలైన్ బ్యాండేజ్ తో కనిపించింది. దీంతో ఈమెకు ఏమైంది అంటూ అభిమానులు సైతం కంగారు పడిపోతున్నారు. ఎప్పుడూ చలాకీగా కనిపిస్తూ అందరినీ నవ్విస్తూ.. అంద చెందాలతో ఆకట్టుకునే ఈమె.. సడన్ గా ఇలా హాస్పిటల్ బెడ్ పై కనిపించేసరికి అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. సోషల్ మీడియా వేదికగా త్వరగా కోలుకోవాలని పోస్టులు కూడా పెడుతున్నారు.
ఇండస్ట్రీకి తొలి పరిచయం..
ఐశ్వర్య లక్ష్మీ.. చేసింది తక్కువ సినిమాలు అయినా మంచి ఫాలోయింగ్ అందుకున్న ఈమె అందం, అభినయంతో ఆకట్టుకుంది. మలయాళ ఇండస్ట్రీలో చాలా సినిమాలలో నటించి మెప్పించిన ఈమె తమిళ్లో యాక్షన్ అనే సినిమాతో పరిచయమై.. సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు అందుకోలేదు. ఆ తర్వాత అమ్ము అనే సినిమాలో నటించింది కానీ ఈ సినిమా కూడా బోల్తా కొట్టింది. అయితే తమిళంలో ఈమె నటించిన మట్టి కుస్తీ సినిమా తెలుగు లో డబ్బింగ్ అయి..ఈమెకు మంచి పేరు లభించింది. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోత సినిమాలో కూడా నటించింది.
హాస్పిటల్ పాలైన ఐశ్వర్య లక్ష్మీ..
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో కూడా అవకాశం అందుకుంది ఐశ్వర్య లక్ష్మీ. ఇదిలా ఉండగా తాజాగా ఈమె అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా పంచుకుంది. అయితే ప్రస్తుతం ఈమెకు ఏమైంది ఎందుకు హాస్పిటల్ పాలైంది.. అనే విషయాలు మాత్రం తెలియ రాలేదు ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏదేమైనా ఐశ్వర్య త్వరగా కోలుకోవాలని, ఎప్పటిలాగే కం బ్యాక్ ఇచ్చి వరుస సక్సెస్ లు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఐశ్వర్య లక్ష్మి బాల్యం, కెరియర్..
1991 సెప్టెంబర్ 6న కేరళ తిరువనంతపురం లో జన్మించిన ఈమె.. ఆ తర్వాత శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎర్నాకులంలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఐశ్వర్య 2014లో మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి , ఆ తర్వాత 2017లో మలయాళంలో విడుదలైన జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది మాయానాది అనే మరో మలయాళం చిత్రంలో కూడా నటించిన ఈమె.. ప్రస్తుతం తమిళ్, తెలుగు మలయాళం భాషల్లో నటిస్తూ.. సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. మరి ఐశ్వర్య లక్ష్మీ కి ఇండస్ట్రీ ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి.
View this post on Instagram