Director Madhan Death : టాలీవుడ్ దర్శకుడు మదన్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆ నలుగురు చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న మదన్…పెళ్లైన కొత్తలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి సినిమాలకు దర్శకత్వం వహించారు. మదన్ సొంతూరు చిత్తూరు జిల్లా మదనపల్లె. సినిమాలపై ఆసక్తితో రచయితగా ఎంట్రీ ఇచ్చారు.
నాలుగు రోజుల కింద మదన్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి శనివారం రాత్రి కన్నుమూశారు. మదన్ మృతిపై టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు రచయితగా, దర్శకుడిగా మదన్ సేవలను కొనియాడారు