Bhimaa movie collections(Tollywood news in telugu): టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్కి హిట్ పడి చాలా కాలమే అయింది. ఇందులో భాగంగా హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. అయినా ఇప్పటివరకు ఎలాంటి హిట్టును అందుకోలేకపోయాడు. అయితే ఈ సారి ఎలా అయినా హిట్టు కొట్టాలని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ నేపథ్యంలో కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వంలో ‘భీమా’ అనే కొత్త సినిమాను చేశాడు. ఇందులో గోపీచంద్కు జోడీగా కావ్యా థాపర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. ఇక పోస్టర్స్, టీజర్, ట్రైలర్తో భారీ అంచనాలు అదుకున్న ఈ మూవీ మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పురాణాల్లోని పరశురాముడి కథ ఆధారంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లరే ఈ భీమా మూవీ. ఇందులో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే నుంచే మిక్స్ డ్ టాక్ అందుకుంది.
READ MORE: ‘గామి’కి భారీ ఓపెనింగ్స్.. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే..?
ఈ మూవీలో యాక్షన్ సీన్స్, గోపీచంద్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నా.. ఎందుకో మరి సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ముందుక మంచి హైప్ ఉండటంతో ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ మూవీని గోపీచంద్ కెరీర్లోనే హయ్యెస్ట్ స్క్రీన్స్లో వదిలారు.
నైజాం, ఆంధ్రాలో కలిపి మొత్తం 600 స్క్రీన్స్, రెస్టాఫ్ ఇండియాలో 100 స్క్రీన్స్, ఓవర్సీస్లో 200 స్క్రీన్లు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 900 స్క్రీన్స్లో ఈ మూవీని రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత కలెక్షన్స్ కాకపోయినా.. పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.
యూఎస్, ఇతర ఏరియాల్లో కలిపి భీమా మూవీ మొదటి రోజు రూ.1.25 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. అలాగే ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తం రూ.1.30 కోట్ల వరకు వసూలు చేసిందని టాక్ నడుస్తోంది. ఇక మొత్తంగా అన్ని ఏరియాలు కలుపుకొని ఈ మూవీ ఫస్ట్ డే రూ.3 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని ట్రెడ్ వర్గాల సమాచారం.
READ MORE: ఓటీటీ కంటే ముందే టీవీలోకి ‘హనుమాన్’.. కన్ఫర్మ్ చేసిన ప్రశాంత్ వర్మ.. ఏ ఛానల్లో తెలుసా
ఇక లాంగ్ వీకెండ్ ఉండటం, ఎక్కువ స్క్రీన్లలో ఈ మూవీ రిలీజ్ అవటంతో భీమా మూవీకి కలెక్షన్స్ భారీగానే వచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ మూవీ రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగినట్లు తెలుస్తోంది.