Tillu Square: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘టిల్లు-2’. మల్లిక్రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తోన్న ఈ మూవీకి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఫన్ ట్రాక్ వీడియోతోపాటు టికెటే కొనకుండా పాటలకు మంచి స్పందన వచ్చింది. వీటితో సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ అయింది. తాజాగా మేకర్స్ మరో సర్ప్రైజ్ అందించారు. సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తూ వదిలిన కొత్త పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి.
నో క్యాప్షన్.. ఓన్లీ యాక్షన్.. 2024 మార్చి 29న ‘టిల్లు 2’ మీ దగ్గరలోని థియేటర్లలో సందడి చేయనుంది.. అంటూ సిద్దు, అనుపమను ఎత్తుకున్న పోస్టర్ను విడుదల చేశారు. ఈ లుక్ సినిమాపై అంచనాలు పెంచడమే కాకుండా క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఇక డీజే టిల్లు సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేసిన సిద్దు ఈ సారి టిల్లు 2తో మరింత డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందించనున్నాడు.