Tollywood Heroes: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంబురాలు మొదలైపోయాయి. మెగా ఫ్యాన్స్ చిరు బర్త్ డేకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఇంకోపక్క మెగా ఫ్యాన్స్ ను మరింత ఉత్తేజపర్చడానికి మేకర్స్ సైతం చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 22 న ఇంద్ర రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. దీంతో అప్పటి ఇంద్ర రోజులను సెలబ్రిటీలు మరోసారి అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే ఇంద్ర సినిమాలో హీరోయిన్ సోనాలి బింద్రే.. తాజాగా అప్పటి రోజులను గుర్తు చేసుకుంది. ఇంద్ర సినిమాచేయడం సంతోషంగా ఉందని, ముఖ్యంగా వైజయంతీ మూవీస్ లో ఈ సినిమా చేయడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది అని చెప్పుకొచ్చింది. ఇక చిరంజీవి గారితో డ్యాన్స్ చేయడం నాకు చాలా వరస్ట్ గా నైపించింది. ఆయన ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో.. ఆయన పక్కన నేను చేయలేకపోయేదాన్ని అని తెలిపింది.
అంతేకాకుండా ఇంద్ర షూటింగ్ అంతా ఎంతో సందడిగా జరిగేదని, చిరు ఫ్యామిలీ అంతా సెట్ కు వచ్చి సందడి చేసేవారని చెప్పుకోచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను వైజయంతీ పంచుకుంది. ఆ ఫోటోలలో ఒక ఫోటోపై అందరి చూపు పడింది. సెట్ లో చిరు చుట్టూ నలుగురు పిల్లలు నిలబడి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందులో ఉన్న పిల్లలు ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.
వారు ఎవరు అంటే.. చిరు వెనుక చెయ్యి అడ్డుపెట్టుకున్న పిల్లాడు.. రామ్ చరణ్.. ఆ పక్కన కళ్ళజోడుతో నిలబడిన పిల్లాడు సాయి ధరమ్ తేజ్ .. ఇటు పక్క నిలబడిన కుర్రాడు వైష్ణవ్ తేజ్. ఇక చిరు పక్కన చైర్ లో కూర్చున్న పాప శ్రీజ. చిన్నతనంలో స్కూల్ లేనప్పుడు.. మె ఈ గ్యాంగ్ మొత్తం సెట్ లోనే ఉండేవారట. ఈ విషయాన్నీ చిరు ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.
అప్పటికీ, ఇప్పటికీ చరణ్ కొంచెం అటుఇటు ఉన్నా.. అసలు తేజ్ బ్రదర్స్ ను అయితే గుర్తుపట్టడం కష్టమని చెప్పాలి. అంతలా మారిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ కుర్ర హీరోలు రేపు ఇంద్ర రీ రిలీజ్ థియేటర్ లో కూడా సందడి చేస్తారేమో చూడాలి.