Bigg Boss 8: తెలుగు టాప్ రిలీయాటి షో బిగ్ బాస్ షో గురించి అందరికీ తెలిసిందే.. ఈ షో తెలుగులో 8 వ సీజన్ ప్రసారం అవుతుంది. ఈ షో ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుంది.. నాలుగో వారం కు నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. అయితే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 12 మంది హౌస్ లోకి రాబోతున్నారనే బాంబ్ ను పేల్చారు.. అయితే హౌస్ లోకి 12 మంది రాబోతున్నారని చెప్పాడు. ఇది విన్న హౌస్ మెట్స్ తో పాటు, ఆడియన్స్ థ్రిల్ గా ఫీల్ అవుతున్నారు. అసలు 12 మంది ఎలా వస్తారు.. వచ్చిన ఏం చేస్తారు అని ఆలోచనలో పడ్డారు. మరి ఆ వచ్చే 12 మంది ఎవరు అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో గొడవలు కాస్త ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ సీజన్ అంత రసవత్తరంగా సాగడం లేదు. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతగా కంటెంట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్స్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి పంపనున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రమోలో బిగ్ బాస్ సీజన్స్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 12 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపిస్తున్నట్టు తెలిపాడు బిగ్ బాస్. అలాగే హౌస్ లో ఉన్న వారికి టాస్క్ లు ఉంటాయని ఆ టాస్క్ ల్లో విన్ అయితే ఆ 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆపొచ్చు అని తెలిపాడు.
ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చేవాళ్లు హౌస్ లో గత సీజన్ లో పాల్గొన్న వారే అయి ఉంటారన్న వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈసారి హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చే వారిలో గత సీజన్స్ కు సంబందించిన వారే ఉంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ముగ్గురు ముద్దుగుమ్మల పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. గత సీజన్స్ లో ఈ భామలు తమ ఆటతో పాటు అందంతోనూ ఆకట్టుకున్నారు. ఇంతకూ ఆ ముగ్గురూ.. బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొన్న హరితేజ.. అలాగే సీజన్ 2లో పాల్గొన్న దీప్తి సునైనా కూడా సీజన్ 8లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక హాట్ బ్యూటీ ఇనయా సుల్తానా కూడా సీజన్ 8లోకి అడుగు పెడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొంది. ఈ ముగ్గురితో పాటుగా రోహిణి, అవినాష్ కూడా రాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులుగా వెయిట్ చెయ్యాల్సిందే మరి..