Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్ల.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు లేరు. ఒకప్పుడు నటిగా, తెనాలి అమ్మాయిగా మాత్రమే పరిచయం ఉన్న శోభితా.. ఇప్పుడు అక్కినేని కోడలిగా పరిచయమయ్యింది. దీంతో ఆమెపై ఫోకస్ మరింత పెరిగింది. సమంతతో విడాకుల తరువాత నాగచైతన్య.. శోభితాతో రిలేషన్ లో ఉన్నారు. ఇక ఈ మధ్యనే వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెల్సిందే.
అక్కినేని కోడలిగా మారాక.. శోభితాకు బాగానే కలిసి వస్తుందని తెలుస్తోంది. ఎంగేజ్ మెంట్ తరువాత శోభితా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఆమె నటించిన బోల్డ్ సిరీస్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయిన ఎమ్మీ అవార్డ్స్ 2024 కు నామినేట్ అయ్యింది. శోభితా తన కెరీర్ ను బాలీవుడ్ లోనే మొదలుపెట్టిన విషయం తెల్సిందే. ఆమె నటించిన వెబ్ సిరీస్ లలో ది నైట్ మేనేజర్ ఒకటి.
ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ను సందీప్ మోదీ, శ్రీధర్ రాఘవన్ తెరకెక్కించాడు. హాలీవుడ్ మూవీ ది నైట్ మేనేజర్ కు రీమేక్ గా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో అనిల్ కపూర్ రెండో భార్యగా అక్కినేని కోడలు కనిపించింది. ఈ సిరీస్ లో శోభితా ఇంటిమేటెడ్ సీన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయని చెప్పాలి. భర్తను వదిలి.. హీరోతో శోభితా నడిపే పప్రేమాయణం హైలైట్ గా నిలిచింది. ఆమె బోల్డ్ సీన్సే ఈ సిరీస్ కు హైలైట్ గా నిలిచాయి.
రెండు సీజన్స్ ఉన్న ఈ సిరీస్ లో శోభితా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ది నైట్ మేనేజర్ ఎమ్మీ అవార్డ్స్ 2024 లో బెస్ట్ డ్రామా సిరీస్ విభాగంలోనామినేట్ అయ్యింది. 14 కేటగిరిలలో భారతదేశం నుంచి ఎంపికైన మొదటి సిరీస్ గా రికార్డ్ సృష్టించింది. దీంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ డ్రామా సిరీస్ కు అవార్డు దక్కుతుందో లేదో చూడాలి.