SVR – NBK:ఇటీవల జరిగిన వీర సింహా రెడ్డి సక్సెస్ మీట్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఎస్.వి.ఆర్, అక్కినేని, తొక్కినేని … అంటూ మాట్లాడుకుంటుంటాం అన్నారు. దీనిపై ఎ.ఎన్.ఆర్ ఫ్యాన్స్ , ఎస్.వి.రంగారవు ఫ్యాన్స్ బాలకృష్ణ మాట్లాడిన తీరుని తప్పు పట్టారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ కొందరైతే బాలకష్ణ దిష్టి బొమ్మలను కూడా తగల బెట్టారు. దీనిపై సీనియర్ నటుడు ఎస్వి.రంగారావు మనవళ్లు స్పందించారు.
‘‘నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం’’ అని తెలిపారు.
Waltair Veerayya: తెలంగాణలో ఫిక్స్ చేసిన ‘వాల్తేరు వీరయ్య’
Sharwanand : ఆ యువతితో హీరో శర్వానంద్ ఎంగేజ్ మెంట్.. ఫోటోలు వైరల్..