Suma:బుల్లి తెర ప్రేక్షకులకు, సినీ అభిమానులకు సుమ గురించిన పరిచయం అక్కర్లేదు. బుల్లి తెరపై స్టార్ మహిళ, క్యాష్ వంటి ప్రోగ్రామ్స్తో పాటు టాలీవుడ్లో పలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్కు ఆమె యాంకర్గా వ్యవహరిస్తుంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఆమె ఈ మధ్య జయమ్మ పంచాయితీ అనే సినిమాలోనూ నటించింది. తాజాగా ఈ స్టార్ యాంకర్ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. ఆమె మంచి మనసును అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంతకీ సుమ ఏం చేసిందో తెలుసా!.. 30 మంది విద్యార్థులను దత్తత తీసుకుంది. వారి లైఫ్లో సెటిల్ అయ్యే వరకు వారికి అండగా ఉంటానని తెలియజెప్పింది.
ఇటీవల మద్రాస్ ఐఐటీలో ఓ ప్రోగ్రామ్కి సుమ కనకాల వెళ్లింది. అక్కడ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెబుతూ ‘‘15 ఏళ్లకే యాంకర్గా మారాను. బి.కామ్, ఎం.కామ్ చదివిన నేను అకౌంటెంట్ అవుదామిన అనుకున్నా, తర్వాత టీచర్గా మారుదామనుకున్నా, కానీ ఇప్పుడు యాంకర్గా మారాను’’ అని అన్నారు. తనకు ఇంత చేసిన సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 30 మంది పేద విద్యార్థులను దత్తత తీసుకున్నానని ఆమె తెలిపారు. సదరు విద్యార్థులు జీవితంలో సెటిల్ అయ్యే వరకు తామే సాయంగా నిలుస్తామని సుమ పేర్కొన్నారు. సుమ చేసిన ఈ మంచి పనిలో కొందరు ఎన్జీఓలు సైతం భాగస్వామ్యులుగా ఉన్నట్లు తెలిపారామె. సుమ చేసిన మంచి పనిని ఇప్పుడు అందరూ అప్రిషయేట్ చేస్తున్నారు.