Sukumar:ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన తీరుని చూసిన వాళ్లు చాలా మంది ఆయన్ని దాసరి నారాయణ రావుతో పోలుస్తున్నారు. మరేంటి! సుకుమార్ ఏమైనా ఇండస్ట్రీకి గురువుగారు అవుతున్నారా! అనే సందేహం రాక మానదు. ఆ విషయం కాదండి బాబు.. సుకుమార్ వెళుతున్న దాసరి దారేంటో తెలుసా? ఇండస్ట్రీకి ఎక్కువ మంది శిష్యులను పరిచయం చేయటంలో. సుకుమార్ తన దగ్గరున్న దర్శకత్వ శాఖలోని వారిని దర్శకులుగా మారుస్తూ సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తనే కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ తన శిష్యులతో డైరెక్ట్ చేయిస్తున్నారు.
పల్నాటి సూర్య ప్రతాప్, బుచ్చిబాబు సహా ఇంకొంత మంది సుకుమార్ స్కూల్ నుంచి వచ్చినవారే. తాజాగా ఇప్పుడు మరో దర్శకుడు కూడా ఈ లిస్టులో చేరారు అదెవరో కాదు. వైష్ణవి అనే మహిళా దర్శకురాలు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీయస్యన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ రూపొందిస్తోన్న సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వయర్లో నటిస్తున్నారు. లేటెస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. దాసరి దారిలో తన శిష్యులన పరిచయం చేస్తున్న సుకుమార్ని అందరూ గ్రేట్ అని అప్రిషియేట్ చేస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకరత్న దాసరి నారాయణరావుకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. 150 సినిమాలను తెరకెక్కించిన వ్యక్తిగానే కాదు.. ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. ఇండస్ట్రీలో అందరూ ఎంతో ప్రేమగా గురువుగారు అంటూ పిలుచుకున్న ఆయన అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన తర్వాత ఆస్థానంలో ఉండబోయే వ్యక్తి ఎవరనే దానిపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఎక్కువ మంది చిరంజీవి పేరుని ప్రస్తావిస్తుంటే .. అలాంటి పదవి నాకు అక్కర్లేదనేశారంతే!.