సీనియర్ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు వి.కెనరేష్పై నెటిజన్స్ ట్రోలింగ్ మొదలెట్టేశారు. ఆయనకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అది కూడా ఎవరితోనని అనుకుంటున్నారా! సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే, సూపర్స్టార్ కృష్ణ అంత్యక్రియలకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు హాజరై నివాళులు అర్పించారు. తర్వాత మహేష్ కుటుంబ సభ్యుల దగ్గర ఆయన కూర్చుని మాట్లాడుతున్నారు. ఆ సమయంలో వి.కె.నరేష్.. మహేష్, నమ్రతలకు ఏదో చెబుతూ చేయి చూపిస్తూ మాట్లాడసాగారు. పక్కనే ఉన్న కేసీఆర్ ఇక చాలు ఆపు అన్నట్లు చేతితో కాస్త గట్టిగానే సైగ చేశారు. వెంటనే నరేష్ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడా వీడియో నెట్టింట ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఆధారంగా చేసుకుని సీనియర్ నరేష్ను కొందరు ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇంతకీ మహేష్ దంపతులకు నరేష్ ఏం చెప్పారో! ఆయన్ని కేసీఆర్ ఎందుకు ఆపమన్నట్లు సైగ చేశారో వారికే తెలియాలి.
బుధవారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అక్కడకు 200 మంది మాత్రమే అనుమతినిచ్చారు. పరిమిత సంఖ్యలోనే మీడియా వారిని కూడా అనుమతించారు. కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కోరిక మేరకు చితి దృశ్యాలను మీడియా కవర్ చేయలేదు.
Link – https://twitter.com/ActualIndia/status/1592696561464922113?s=20&t=B4nWknSNaeH5HIxJ6-rpJA