EPAPER

Star Director: హీరోయిన్ లు దుబాయ్ కి వెళ్ళేది అందుకే.. హాట్ కామెంట్స్ వైరల్..!

Star Director: హీరోయిన్ లు దుబాయ్ కి వెళ్ళేది అందుకే.. హాట్ కామెంట్స్ వైరల్..!

Star Director.. ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ (Geeta Krishna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎక్కువగా సినిమా అంశాలతో పాటు సమకాలీన అంశాలపై కూడా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పలువురు హీరోయిన్లపై అసభ్యకర కామెంట్లు చేస్తూ చేసిన వ్యాఖ్యలు అందరిలో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని చెప్పవచ్చు.


ఆ హీరోయిన్స్ డబ్బు కోసం ఏదైనా చేస్తారు..

రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన ముంబై బ్యూటీ కాదంబరి జత్వానీ(Kadambari jetwani) కేసు పై తాజాగా గీతాకృష్ణ స్పందించారు. అంతేకాదు సినీ తారలు విదేశాలలో ఆస్తులు కొనడం, తరచుగా హీరోయిన్లు దుబాయ్ కి వెళ్లడం వంటి విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గీతాకృష్ణ మాట్లాడుతూ బాలీవుడ్ హీరోయిన్లు చక్కగా ఫిజిక్ మెయింటైన్ చేస్తారు. అయితే దక్షిణాది అమ్మాయిలు అలా కాదు త్వరగా లావు అయిపోతారు. మలయాళీ అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు.. సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా తమ పాత్రకు ప్రాధాన్యం ఉందా లేదా అన్నది కూడా చూడరు. కేవలం డబ్బు ఇస్తే ఎలాంటి పాత్ర చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు అంటూ సంచలన కామెంట్లు చేశారు. అంతేకాదు ఈ విషయాలన్నీ కూడా బాలీవుడ్ లో మరింత ఎక్కువగా ఉంటాయని ఆయన ఆరోపణలు చేశారు.ఈ విషయంపై సందీప్ రెడ్డి వంగా కూడా చెప్పారు కదా అంటూ మరో హాట్ బాంబు పేల్చారు గీతాకృష్ణ..


కాదంబరి జత్వానీపై డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్..

ఇక హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ.. దుబాయ్ లో జరిగే రియల్ ఎస్టేట్ షోలకు కాదంబరీ జత్వాన్ని ఎక్కువగా హాజరవుతుంది. ఈ క్రమంలోనే పెద్దవాళ్లతో ఆమెకు పరిచయాలు ఏర్పడ్డాయి. ఆమె తమ్ముడు దుబాయ్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. అందుకే ఆమెను ఆ రంగంలోకి దింపాడు అంటూ ఆయన వెల్లడించారు.

హీరోయిన్స్ దుబాయ్ కి వెళ్ళేది అందుకే..

ముఖ్యంగా దుబాయ్ లో చాలామంది సినీ ప్రముఖులకు ఆస్తులు ఎక్కువగా ఉంటున్నాయి. హీరోయిన్లు దుబాయ్ ఎందుకు వెళ్తారో నేను ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను. అక్కడి షేక్ లతో పడుకోవడానికి హీరోయిన్లు దుబాయ్ కి వెళ్తారు. అంతే కాదు ఇందుకోసం ఒక ఏజెన్సీ కూడా పనిచేస్తుంది. ఇందుకు గానూ ఒక రాత్రి స్టే చేసినందుకు కోట్ల రూపాయలు వారు సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా డబ్బులు లేకపోతే దుబాయ్ వెళ్లిపోతారు అంటూ సంచలన కామెంట్లు చేశారు గీతాకృష్ణ.  ఇదిలా ఉండగా పలువురు సెలబ్రిటీలు గతంలో ఇలాంటి విషయాలపై కామెంట్లు చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి గీతాకృష్ణ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ ఉండడం గమనార్హం.

దుష్ప్రచారాలు సినిమా ఇమేజ్ ను దెబ్బతీస్తాయి..

అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడుతూ.. ప్రస్తుతం స్టార్ హీరోలు సినిమాలపై ఇంకో హీరో అభిమానులు దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇది సినిమా పరిశ్రమకే మంచిది కాదు. ఇలాంటి మంచి వాతావరణాన్ని కనీసం చెడగొట్టకుండా ఉంటే చాలు అంటూ గీతా కృష్ణ తెలిపారు.

Related News

Prasanth Neel With Ntr: ప్రీక్వెల్ లేదు సీక్వెల్ లేదు కంప్లీట్ సింగిల్ సినిమా

Kanguva : సూర్య ‘కంగువా’ లో ప్రభాస్.. ఇదేం ట్విస్ట్ మామా..!

Vettaiyan : సినిమా స్టోరీలో వేలు పెట్టిన రజినీకాంత్… ఆ సీన్స్ ఛేంజ్ 

2025 Sankranti Releases: కన్ఫ్యూజింగ్ సంక్రాంతి 2025.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో అంతా అయోమయం, గందరగోళం!

Anirudh : ఎంత రిలేటివ్ అయిన అంత స్వార్ధం ఉండకూడదు

Shyamala Devi: త్వరలోనే అంటూ ప్రభాస్ పెళ్లిపై గుడ్ న్యూస్..!

Pushpa2 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. పుష్ప 2 మూవీ మళ్లీ వాయిదా?

×