EPAPER

SSMB-29: మహేశ్- రాజమౌళి సినిమా.. కథ చెప్పేసిన విజయేంద్ర ప్రశాద్..!

SSMB-29: మహేశ్- రాజమౌళి సినిమా.. కథ చెప్పేసిన విజయేంద్ర ప్రశాద్..!

SSMB-29: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే నెక్స్ట్ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆయన ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ ప్రపంచం మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో తీస్తున్నట్లు ప్రటించారు. ఫుల్ యాక్షన్ అండ్ అడ్వంచర్‌తో కూడిన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. దీంతో మహేశ్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


మహేశ్ ముఖ్యంగా ఈ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసినట్లు ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రశాద్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విశేషాలని అతడు పంచుకున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రశాద్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని తెలుపుతూ.. మరింత హైప్ పెంచేశారు.

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్ – రాజమౌళి సినిమా ‘ఇండియానా జోన్స్’లా ఉంటుందని అన్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని చెప్పారు. ఈ సినిమా ఎక్కువగా అడవి నేపథ్యంలోనే సాగుతుందని తెలిపారు. అలాగే ఈ సినిమా సంగీతం గురించి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయన మాటలతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.


Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×