Gunturu kaaram: అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న నటీమణులలో యంగ్ బ్యూటీ శ్రీలీల ఒకరు. ఎంట్రీ ఇచ్చిన ఒక్క ఏడాదిలోనే ఈ హీరోయిన్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. అందం, నటన, డాన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు మహేశ్ బాబు సరసన ‘గుంటూరు కారం’ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ భామ దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేశ్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
త్రివిక్రమ్ గారు ఎన్నో పుస్తకాలను, పేజీలను చదివి.. వాటన్నింటి గురించి ఒక్క ముక్కలో అర్థం చేప్పేస్తారు అని తెలిపింది. అయితే తనను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రాఘవేంద్ర రావు గారు ఇంట్రడ్యూస్ చేయగా.. ఇప్పుడు త్రివిక్రమ్ గారు గుంటూరు కారం ద్వారా కొత్త శ్రీలీలని రీ లాంచ్ చేసినట్టు అనిపిస్తుంది అంటూ చెప్పింది. చాలా చాలా థాంక్యూ సర్ అని త్రివిక్రమ్ని తెగ పొగిడేసింది. అలాగే మహేశ్ బాబుని కూడా తన మాటలతో చాలా ఇంప్రెస్ చేసింది ఈ ముద్దుగుమ్మ.