దగ్గుపాటి వారి పెళ్లి ఢంకా లంకలో మోగిన విషయం అందరికీ తెలిసిందే. దగ్గుపాటి సురేష్ చిన్న కొడుకు.. దగ్గుపాటి అభిరామ్ కు శ్రీలంకలో అతని మరదలు వరుసైన ప్రత్యూషతో ఘనంగా జరిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అభిరాం పెళ్లి అంటే శ్రీరెడ్డి స్పందించకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అప్పట్లో అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేసుకుంటూ తనని వాడుకొని వదిలేసాడు అని శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మరి ఇప్పుడు కూడా అదే జరిగింది.
సంచలనాత్మకమైన పోస్టులకు పెట్టింది పేరు గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరెడ్డి.. అభిరాం పెళ్లి ఫోటోలు పై మరొకసారి సంచలనమైన పోస్ట్ పెట్టింది. నేను సీతని.. అభిరామ్ రాముడు అంటూ శ్రీరెడ్డి పెట్టిన షాకింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నువ్వు ఏ యాంగిల్ లో సీతవి తల్లి అని కామెంట్ చేసే వాళ్ళు కొందరైతే.. శ్రీ రెడ్డి పోస్టులను సమర్థించే వారు మరి కొంతమంది. మొత్తానికి ఒక్క పోస్టుతో తిరిగి రచ్చ మొదలు పెట్టింది శ్రీరెడ్డి. ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి..
ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ సర్వసాధారణం.. మొన్నటికి మొన్న వరుణ్ తేజ్ ,లావణ్య ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. అలాగే దగ్గుపాటి అభిరామ్ తను డెస్టినేషన్ వెడ్డింగ్ శ్రీలంకలో చేసుకున్నాడు. శ్రీలంక చారిత్రాత్మకంగా భారతదేశంతో ముడిపడినదే.. కానీ అది ఒకప్పటి మాట కదా. అయినా గాని శ్రీ రెడ్డి ప్రస్తుతం ఉన్న లంకని ఒకప్పటి రావణుడి లంకతో పోల్చి మరీ పెట్టిన పోస్ట్ అందరిని షాక్ కి గురి చేస్తోంది. శుభమా అని పెళ్లి చేసుకుంటే నీ పోలిక ఏంటి తల్లి..అని కొందరు మండిపడుతున్నారు..
ఇంతకీ పోస్టులో ఏముందంటే..’మనం దేవతలగా కొలిచే రాముడిని సీతాదేవిని విడదీసిన దేశం.. అది సీతాదేవి శాపాలకు నిలయం.. ఆంజనేయుడు కోపాగ్ని కారణంగా మంటల పాలైన దేశం.. అశోక వనంలో బందీగా ఉన్న సీతమ్మ రాముడి కోసం నిద్రాహారాలు మాని దుఃఖంతో ఎదురుచూసిన రావణుడి లంక.. శ్రీలంక.. మరి అలాంటి ర లంకలో దగ్గుపాటి అభిరాం పెళ్లి.. ‘అంటూ రాసుకుంది.
అంతేకాదు ..నేను దైవ నిర్ణయాన్ని గౌరవిస్తాను.. ఎప్పటికైనా రాక్షసులు ..రాక్షసులే.. అంటూ సంచలమైన స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ పై మిక్స్డ్ స్పందన కనిపిస్తోంది. మరి దీనిపై అభిరామ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.