VaniJayaram: ప్రముఖ గాయని వాణీజయరాం కన్నుమూశారు. 78 ఏళ్ల వయస్సులో.. చెన్నైలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. వాణీజయరాంకు ఇటీవలే పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం.
వాణీజయరాం 19 భాషల్లో 20వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్ పురీ… ఇలా బహుభాషా గాయణిగా పేరుగాంచారు.
1945, నవంబర్ 30న తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. ఆరుగురు అక్కాచెళ్లెళ్లలో ఆమె 5వ సంతానం. వాణీజయరాం అసలు పేరు కలైవాణి. కర్నాటక సంగీతంలో దిట్ట. ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించిన ఘనత. మద్రాసు క్వీన్స్ మేరీ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత సినిమా పాటను కెరీర్ గా చేసుకొని.. వేలాది పాటలు పాడారు.