Singer P Susheela Admitted to Hospital: ప్రముఖ గాయని పి.సుశీల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే చెన్నైలోని మైలాపూర్ కావేరి ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో విపరీతమైన కడుపునొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం విషయంపై సినీవర్గాల ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, సుశీల..1950 నుంచి 1990 వరకు దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాత గాయనిగా ఎదిగారు. ఎన్నో విజయాలు అందుకుని అభిమానుల్లో తిరుగులేని చోటు సంపాదించుకున్నారు. భారతీయ సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం వంటి భాషల్లో ఆమె తకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా పరిశ్రమంలో సుశీల సేవలకు గుర్తింపుగా కేంద్రం ప్రభుత్వం ఆమెను 2008లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతో పాటు ఆమె మరో ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి చెందిన 86 ఏళ్ల సుశీల.. వయోభారంతో గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే సుశీల తెలుగులోనూ ఎన్నో అద్భుత గీతాలు ఆలపించారు. ఈ పాటలు యువతతోపాటు అందరినీ ఉర్రూతలూగించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో మొత్తం 50వేలకు పైగా పాటలు పాడారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అతికొద్ది మందిలో సుశీల కూడా ఒకరుగా గుర్తింపు పొందారు.
Also Read: ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ డైరెక్టర్ ను గుర్తుపట్టండి చూద్దాం..
ఇక, సినమాల్లో సావిత్రి, పద్మిని, సరోజాదేవి వంటి దిగ్గజ నటీమణలకు సైతం ఈమె పాటలు పాడారు. ఉష్రేష్ మన్మాన్ మూవీలోని ‘లైక్ పాల్’ అనే పాటకు ఆమె మొదటిసారిగా ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. గత కొంతకాలంగా ఆమె వయసు భారం కారణంగా పాటలు పాడడం లేదు. కేవలం ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా సుశీల.. త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.