Shraddha Kapoor: ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ముఖేష్ అంబానీ ఒకరు. ఇప్పుడు ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి సిద్ధమయ్యారు. 2023లో అనంత్ అంబానీ, రాధిక గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్నారు.
వీరి పెళ్లి ముహుర్తం ఈ ఏడాది 2024 జులై 12న జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి కంటే ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్శహిస్తున్నారు. ఇప్పుడు ఈ నెల మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకను అంగరంగ వైభవంగా జరపనున్నారు. జామ్నగర్లో మూడు రోజుల పాటు ఈ వేడుక ఘనంగా జరగనుంది.
ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు 50 వేల మందికి పైగా అన్నదానం నిర్వహించారు. ఇక అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు ఖరీదైన కార్లు, విమానాల్లో వస్తున్నారు. వీరితో పాటుగా పలు భాషల నుంచి ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఈ వేడుకుకు హాజరవుతున్నారు.
READ MORE: క్రేజీ కాంబో.. తమన్నాతో సంపత్ నంది.. ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్
అయితే ఈ వేడుకకు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్.. మరికొంతమంది ప్రముఖులతో కలిసి జామ్నగర్కి పయణమైంది. అయితే ఆమెతో పాటు ఆమె ప్రియుడు రాహుల్ మోడీ కూడా కనిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ కోసం గుజరాత్ చేరుకోవడానికి ముందు శ్రద్ధా కపూర్, రాహుల్ ఇద్దరూ ముంబైలోని ప్రైవేట్ టెర్మినల్లో కనిపించారు.
అక్కడ ఇద్దరూ తెల్లటి దుస్తుల్లో కనిపించారు. వీరిద్దరూ కలిసి బస్సు వద్దకు వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఈవెంట్ కోసం జామ్ నగర్ చేరుకున్న ఇతర ప్రముఖ బాలీవుడ్ తారలలో వీరిద్ధరూ ఉన్నారు. వీరిద్దరి వీడియో ప్రకారం.. శ్రద్ధా, రాహుల్ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా శ్రద్ధా, రాహుల్ గత కొంతకాలంగా ప్రమాయణం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై వీరిద్ధరూ ఎప్పుడూ వెల్లడించలేదు.
READ MORE: ఈ రోజు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే.. రాఖీ భాయ్ ఆగయా..
కానీ ఈ జంట అప్పుడప్పుడు కెమెరాలకు చిక్కడంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటాయి. ఇక ఇప్పుడు ఈ జంట మరోసారి ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు కలిసి వెల్లడంతో నిజంగానే శ్రద్ధా కపూర్, రాహుల్ ప్రేమలో ఉన్నారని నెటిజన్లు గుస గుసలాడుకుంటున్నారు.