Sekhar Bhashaa : గత కొన్ని రోజులుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టార్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను తాజాగా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేషనల్ వైడ్ గా ఎంతోమంది స్టార్ హీరోస్, హీరోయిన్స్ తో పని చేసి ప్రశంసలు అందుకున్న జానీ మాస్టర్ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేసింది. తనను జానీ మాస్టర్ లైంగికంగా హింసించాడనే ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేసింది. దీంతో ఆయనపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆ లేడీ కొరియోగ్రాఫర్ కు సపోర్టుగా నిలుస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరు ముందుకి వస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ఆర్జె శేఖర్ భాష కూడా ముందుకు వచ్చారు. ఆయన మాస్టర్ పై అనేక ఆరోపణలు చేశారు.. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.
బిగ్ బాస్ తెలుగు హౌస్ లో ఎనిమిదవ సీజన్ లో రెండో వారం ఎలిమినేట్ అయ్యాడు శేఖర్ భాషా.. బయటకు వచ్చిన తర్వాత శేఖర్ బాషా బయట పుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వరసగా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. బిజీబిజీగా మారారు. బిగ్ బాస్ లోని అనుభవాలను పంచుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మరోసారి తాను బయటికి కారణం వెల్లడించారు. తానే కావాలని బయటకు వచ్చానని అన్నారు. అయితే రాజ్ తరుణ్ గురించి సంచలన నిజాలను బయట పెట్టిన శేఖర్ ఇప్పుడు జానీ మాస్టర్ గురించి మాట్లాడి మరోసారి వార్తల్లో హైలెట్ అవుతున్నాడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆర్జె శేఖర్ భాషా జానీ మాస్టర్ టాపిక్ పై చర్చించడం విశేషం..
లైంగిక వేధింపుల కేసు లో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ పై కొన్ని నమ్మలేని నిజాలను బయట పెట్టారు. ‘ఢీ ఫేమ్ తో వచ్చి మాస్టర్నే డీఫేమ్ చేస్తుంది’ అని అన్నారు. మీడియా కథనాలను బట్టి చూస్తే.. ఏదో కుట్రగా ఉందని అన్నారు. ఆ లేడీ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర చాలా సంవత్సరాలు వర్క్ చేసింది. అప్పుడు తప్పుగా చేసి ఉంటే అప్పుడే కంప్లైంట్ చేయకుండా ఇప్పుడేందుకు మాట్లాడుతుందని అన్నారు. జానీ మాస్టర్ తప్పుగా ప్రవర్తించి ఉంటే.. తొలిసారే పోలీసులకి ఫిర్యాదు చేయాల్సింది అని అన్నారు. కానీ, అమ్మాయి ట్రాక్ రికార్డ్ చూస్తే.. గతంలో ఇలాంటి పనులు చేసినట్టు తనకు తెలియడం లేదన్నారు.. లైంగిక ఆరోపణలు కాదు వారి మధ్య ఎదో జరిగి ఉండవచ్చనీ, లేకపోతే.. ఇన్నిరోజులు లేనిది ఈ రోజు పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టడమేంటని అన్నారు. మాస్టర్ నుంచి ఏదైనా ఆశించి, అది జరగపోతే ఇలా బెదిరింపులకు పాల్పడుతుందా ? అనే అనుమానం వస్తుందన్నారు.. ఏది ఏమైనా న్యాయం ఉంటే అదే గెలుస్తుందని చెప్పాడు. ప్రస్తుతం ఆర్జె శేఖర్ భాషా అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..