Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. మొదటి సినిమానే ఘన విజయం సాధించడంతో వెనుదిరిగి చూసుకోలేదు సామ్. వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టడంతో ఫుల్ బిజీ అయిపోయింది. తక్కువ సమమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకొని.. అగ్రహీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.
2010లో నాగచైతన్య హీరోగా వచ్చిన ‘ఏమాయ చేసావే సినిమా’లో జెస్సీ పాత్రలో నటించి అలరించింది సామ్. గౌతమ్ మేనన్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సామ్ ఇండస్ట్రీలోకి వచ్చి 13 ఏళ్లు అవుతున్న సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. తాను ఎంత ఎదిగినా అభిమానులు చూపించే ప్రేమను మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. తనపై ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. గతంలో తనను ఎన్నో విషయాలు బాధించేవని.. ఇకపై ప్రేమ, కృతజ్ఙతతోనే కొనసాగుతానని చెప్పుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరలవుతోంది.
ఇక ఈ సినిమా ద్వారా దగ్గరైన సామ్-చై ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కొద్దిరోజుల పాటు డేటింగ్లో ఉండి.. 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే అనుకోని కారణాల వల్ల సామ్-చై 2021లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత కెరీర్ పైనే ఫోకస్ పెట్టిన సమంత. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. సమంత కెరీర్ సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో ఒక్కసారిగా ఊహించని రీతిలో బ్రేక్ పడింది.
మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది సామ్. దాదాపు 9 నెలలుగా ఆ వ్యాధితో పోరాడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తిరిగి సినిమాలపై ఫోకస్ పెడుతోంది. ఇటీవల సమంత నటించిన ‘యశోద’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సామ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది. అలాగే ‘శాకుంతలం’ సినిమాతో పాటు ‘సిటాడెల్’ అనే వెబ్సిరీస్లోనూ చేస్తుంది.