EPAPER

Sai Durgha Tej: ఇప్పటివరకు ‘విరూపాక్ష’ చూడలేదు, మెగా హీరోలంతా కలిస్తే అదే టాపిక్.. సాయి దుర్గా తేజ్ కామెంట్స్

Sai Durgha Tej: ఇప్పటివరకు ‘విరూపాక్ష’ చూడలేదు, మెగా హీరోలంతా కలిస్తే అదే టాపిక్.. సాయి దుర్గా తేజ్ కామెంట్స్

Sai Durgha Tej: మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయమయినప్పటి నుండి తనకు మెగా ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ లభించింది. కెరీర్ మొదట్లో కొన్ని హిట్స్ అందుకున్న తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడ్డాయి. అయినా కూడా మెగా హీరోగా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంతలోనే ఒక యాక్సిడెంట్ తన జీవితాన్ని మార్చేసింది. బైక్ యాక్సిడెంట్ వల్ల స్పృహ కోల్పోయి కొన్నాళ్ల పాటు హాస్పిటల్‌లో ఉండి మళ్లీ కోలుకొని సినిమా సెట్స్‌లో అడుగుపెట్టాడు సాయి ధరమ్ తేజ్. ‘విరూపాక్ష’తో మళ్లీ ఫార్మ్‌లోకి వచ్చాడు. తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్.. తన ఫ్లాపుల గురించి, యాక్సిడెంట్ గురించి మాట్లాడాడు.


మాట్లాడడానికి గొంతురాలేదు

బైక్ నడిపేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించమని రిక్వెస్ట్ చేస్తూ ఈవెంట్‌లో తన స్పీచ్ మొదలుపెట్టారు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) అలియాస్ సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej). యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో తనకు అస్సలు గుర్తులేదని, కేవలం రోడ్డుపై పడిపోయింది మాత్రమే గుర్తుందని అన్నాడు. ఆ సమయంలో మాట్లాడడానికి గొంతురాలేదని గుర్తుచేసుకున్నాడు. అంత పెద్ద యాక్సిడెంట్ నుండి బయటపడడానికి తన అమ్మే కారణమని బయటపెట్టాడు. 2021 సెప్టెంబర్ 11న బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు సాయి దుర్గా తేజ్. దాని నుండి పూర్తిగా బయటపడడానికి తనకు దాదాపు ఆరు నెలలు పట్టింది.


Also Read: బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

గురువు కూడా

మెగా ఇంట అందరూ హీరోలే అయినా తామంతా కలిసినప్పుడు అసలు సినిమాల గురించి మాట్లాడుకోమని చెప్పాడు సాయి దుర్గా తేజ్. మహా అయితే అందరి తరువాతి ప్రాజెక్ట్ ఏంటని చర్చించుకుంటామని, అంతకు మించి సినిమాల ప్రస్తావన వారి మధ్య రాదని తెలిపాడు. సినిమాల గురించి కాకుండా దేని గురించి మాట్లాడుకుంటారు అంటే సమాజం గురించి మాట్లాడుకుంటామని బయటపెట్టాడు. పవన్ కళ్యాణ్‌కు మెగా ఫ్యామిలీలో ఉన్న అతిపెద్ద ఫ్యాన్ సాయి దుర్గా తేజ్. ఆయన తనకు గురువు, స్నేహితుడు కూడా అని అన్నాడు ఈ మెగా హీరో. పవన్‌తో కలిసి ‘బ్రో’ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. తనను నటనవైపు నడిపింది ఆయనే అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

ఫ్లాపుల వల్లే

సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. కానీ దాని తర్వాత వరుసగా 6 ఫ్లాపులు ఎదురయ్యాయి. దానివల్లే తనకు ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలనే క్లారిటీ వచ్చిందని అన్నాడు సాయి దుర్గా తేజ్. తనకు హారర్ కథలంటే భయమని, అందుకే ఇప్పటికీ తాను నటించిన ‘విరూపాక్ష’ను కూడా చూడలేదని బయటపెట్టాడు. తన తర్వాతి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ..అందరూ షాకయ్యే కథతో రాబోతున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. రానా, రామ్ చరణ్ ఫ్రెండ్‌షిప్ గురించి చాలామందికి తెలుసు. ఈ సందర్భంగా మరోసారి వారి ఫ్రెండ్‌షిప్ గురించి గుర్తుచేసుకుంటూ స్కూల్ డేస్‌లో చరణ్ టిఫిన్‌ను రానా తినేసేవాడని చెప్పి నవ్వాడు.

Related News

High Court on Allu Arjun: హైకోర్టులో అల్లుఅర్జున్ కు ఊరట.. అప్పటి వరకు చర్యలు వద్దంటూ ఆదేశం..

Kanguva: ‘కంగువ’లో ఊహించని గెస్ట్ రోల్.. ప్రేక్షకులను ఆటపట్టిస్తున్న సూర్య

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పొలిటికల్ ఎంట్రీ.. ఆయన ఏమన్నాడంటే.. ?

Priyanka Chopra : ఆ హీరోలతో ముద్దులు, నాతో మాత్రం హద్దులు… ప్రియాంక చోప్రాపై సీనియర్ నటుడి కామెంట్స్

Alia Bhatt: అలియాకు పక్షవాతం.. సిగ్గులేదు అంటూ మండిపడ్డ బ్యూటీ

Brahmanandam: స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన బ్రహ్మీ.. అసలు నిజం ఏంటంటే..?

Big Stories

×